రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గ్రుహ ఆవిష్కరణ..
పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా చేశామని ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్బంగా తేలియచేశారు. రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు సొంత ఆంటి కళను సాకారం చేశామన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు… 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆ ఇళ్ల నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతుందని అన్నారు.
ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి మాటల్లో..
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13వేల పంచాయితీలు ఉంటే.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు వస్తున్నాయని.. ఇక్కడ కాలనీలలో ఇళ్లు చూసి… ఇవి ఇళ్లు కాదు ఊళ్లు అని గర్వంగా చెపుతున్నానారు. ఇంత భారీగా 31 లక్షల ఇళ్ల స్ధలాలిచ్చి.. అందులో 22 లక్షల ఇళ్లను కడుతూ.. ఇవాల్టికి 7.43లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేశామన్నారు.