రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు పని చేయాలని డిప్యూటి సీ.ఎం. పవన్ కళ్యాణ్ సూచించారు. తనకు కేటాయించిన శాఖలపై వరుస సమీక్షల్లో భాగంగా ఆయన రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఇన్నోవేషన్ కు అనుగుణంగా పిల్లలను తగిన నైపుణ్య వంతులుగా తీర్చే దిద్దే ప్రయత్నం వేగంగా సాగాలని స్పష్టం చేశారు. పిల్లలకు శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి కల్పించడంపై ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో చాలా ప్రతిభ ఉంటుందని దానిని వెలికితీసేలా భారీ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడానికి సన్నద్దం కావాలని సూచించారు.
రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో పవన్ భేటీ…
![pawan](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/pawan-2.jpg?resize=1080%2C440&ssl=1)