Political

రాహుల్ గాంధీ అమేథీ అభ్యర్థిత్వంపై స్మృతి ఇరానీ వ్యాఖ్యలు…

7bgt4image1

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాల మధ్య స్మృతి ఇరానీ ఎన్నికలకు ముందే అమేథీ నుంచి ఓటమిని ప్రకటించినట్లు తేలిందని వ్యాఖ్యానించారు. అమేథీ నుంచి ఒంటరిగా పోటీ చేయాలని రాహుల్‌ కు సవాల్‌ విసిరిన ఆమె.. కాంగ్రెస్‌ అధినేత్రికి దమ్ము, ధైర్యం ఉంటే మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ లేకుండా పోటీ చేయాలని సూచించారు.

ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎం.పీ. జైరాం రమేష్ స్పందిస్తూ… స్మృతి ఇరానీ ఏం చెప్పినా పార్టీ ఒక విధానాన్ని అనుసరిస్తుందని, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సీ.ఈ.సీ. నిర్ణయిస్తుందని అన్నారు. సమావేశం ఉంటుందని, ఆ తర్వాతే అభ్యర్థుల జాబితా వెలువడుతుందని చెప్పారు. మార్చి 6న జరిగిన సమావేశంలో చర్చించిన రాష్ట్రాల అభ్యర్థులను ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉందని జైరాం తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.