జమ్ము కాశ్మిర్ లోని రియాసి జిల్లాలో ప్రయాణీకుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది మరణించన విషయం విదితమే. అంతేకాకుండా 41 మంది గాయపడ్డారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత జమ్మూ, కాశ్మీర్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడిలో పాల్గొన్న ఉగ్రవాది యొక్క స్కెచ్ను విడుదల చేసి రూ. 20 లక్షలు ప్రకటించారు. అతని గురించి సమాచారం ఇస్తే 20 లక్షల రివార్డు ఇస్తామని తెలిపారు.
ఇటీవల పౌని ప్రాంతంలో యాత్రి బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆచూకీ గురించి ఫలవంతమైన సమాచారం ఇస్తే రియాసీ పోలీసులు రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారని పోలీసు ప్రతినిధిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరణ ఆధారంగా ఉగ్రవాది స్కెచ్ను సిద్ధం చేశామని, సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.