తమ న్యాయమయిన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు తలపెట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలను కాకినాడ కలక్టరేట్ ఎదుట సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్ది, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు ప్రారంభించారు. కలక్టరేట్ వద్ద దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో ఎండలోనే ఫుట్ పాత్ పై దీక్షలను కొనసాగించారు. అంగన్వాడీల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీలపై జీ.వో. నెంబర్-2 ఎస్మా ప్రయోగించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం భయంతో ఇటువంటి నిర్నయం తీసుకుందని వాపోయారు. కార్మికులు, ఉద్యోగుల ఉద్యమాలపై ఎస్మాను ప్రయోగించిన ముఖ్యమంత్రులందరూ అధికారానికి దూరమయ్యారని గుర్తుచేసారు.