జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు కోరారు. సర్వే విధుల్లో ఉన్న ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలకు ప్రభుత్వం సమకూర్చిన ట్యాబ్ లను స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ప్రభుత్వం సమకూర్చిన ట్యాబ్ లను సద్వినియోగం చేసుకొని, సర్వేను మరింత పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
సర్వేలో భాగంగా సరిహద్దుల నిర్ధారణ, ఇతర సమాచారాన్ని క్రోడీకరించి నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన రోవర్లు, ట్యాబ్ లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్పొరేషన్ పరిధిలోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న సుమారు 100 మందికి ఈ ట్యాబ్ లు సమకూర్చామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, డిసిపి హరిదాస్, ఏసీపి నాగశాస్త్రులు, మేనేజర్ కర్రి సత్యనారాయణ, రిటైర్డ్ మేనేజర్ డి వి ఎస్ ఎన్ మూర్తి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.
రీ సర్వే ను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం….
![WhatsApp Image 2023-10-13 at 7.32.29 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-13-at-7.32.29-PM.jpeg?resize=1296%2C700&ssl=1)