డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజీలో జిల్లా సర్వే, భూమి రికార్డుల శాఖ ఏర్పాటు చేసిన జిల్లా డేటా ప్రోసెసింగ్ సెంటర్ (రీ సర్వే ) ను కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు-భూ రీ సర్వే ను ఆ జిల్లాకు సంబంధించిన పూర్తి డేటాను నిక్షిప్తపరిచే విధంగా జిల్లా డేటా ప్రాసెసింగ్ సెంటర్ (రీ సర్వే)ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో క్షేత్రస్థాయిలో చేపట్టిన సమగ్ర భూ రీ సర్వేను జిల్లా డేటా ప్రాసెసింగ్ సెంటర్లో నిక్షిప్తమై ఉంటుందన్నారు. ఈ కేంద్రం నిర్వహణకు ప్రత్యేక శిక్షణ కలిగిన సిబ్బంది నియమించినట్లు తెలిపారు. ప్రాసెసింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లను కలెక్టర్ పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
రీ సర్వే సెంటర్ ను ప్రారంభించిన హిమాన్షు శుక్ల…
![images (13)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/images-13-1.jpeg?resize=715%2C429&ssl=1)