ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలోని రైటోలి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న టెంపో అదుపుతప్పి ఒక లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో టెంపోలో ఉన్న 23 మంది పర్యాటకులలో కనీసం 15 మంది మరణించగా, 11 మంది గాయపడ్డారు. ఇందులో నోయిడాలోని ఒక ఫ్లాట్ను పంచుకున్న ఆరుగురు మహిళలు ఉన్నారని అధకారులలు తెలిపారు.
ఆరుగురు స్నేహితులు నోయిడాలోని వివిధ సంస్థలలో పని చేస్తున్నారని తెలిపారు. సెక్టార్ 51లోని ఒక షేర్డ్ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు. గర్వాల్ హిల్స్లోని చోప్తా, తుంగనాథ్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మోహిని పాండే, స్మృతి శర్మ, నికితా భట్, అంజలి శ్రీవాస్తవ ప్రాణాలు కోల్పోగా, వందన శర్మ, శుభం సింగ్ గాయపడ్డారు.