కాకినాడ 16వ డివిజన్లో రూ.44 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక గోగుదానయ్యపేట 16వ డివిజన్లో నిర్వహించిన వై నీడ్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి జగన్ ప్రభుత్వం ప్రత్యక్ష సహాయాన్ని అందజేసి ఆదుకుందన్నారు. ప్రజలకు మంచి చేసే నాయకులను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం లబ్ధి పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమం అనంతరం వైకాపా జెండాను సిటీ పార్టీ ప్రెసిడెంట్ సుంకర శివప్రసాన్నసాగర్, ఎమ్మెల్యే ద్వారంపూడి ఆవిష్కరించారు. 16వ డివిజన్ ఇంచార్జ్ పేర్ల జగన్నాథం, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, 16వ డివిజన్ గృహ సారదులు, కన్వీనర్లు, వాలంటీర్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.