ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాదించిన ఎం.ఎల్.ఏ. లు శాసనసభ లో ప్రమాణ స్వీకారం చేసారు. అయితే అందులో కొంతమంది అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదని సంభందిత అధికారులు తెలిపారు. ఈ రోజు 172మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేసారు. రేపు ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రేపు ఉదయం జీ.వీ. ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణం చేయనున్నారు. సభ్యుల ప్రమాణo తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనున్నట్లు సామాచారం. రేపు ఉదయం 11గంటలకు స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ని శాసనసభ ఎన్నుకోనున్నారు.
రేపటికి వాయిదా పడిన శాసనసభ…
![ap](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/ap.jpg?resize=474%2C277&ssl=1)