![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Minister-Pinipe-Viswaroop.jpg?resize=592%2C1024&ssl=1)
అమలాపురం మండలం , రెడ్డిపల్లి లో సుమారు 23 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తు నాటిన నుంచి విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచి వారికి ఆర్థిక భరోసాను అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిందన్నారు. రైతు భరోసా కేంద్రాలలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారుల చేతిలో పెట్టి మోసపోకుండా రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేలా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.