Kakinada

రైతు సమస్యలపై బీజే.పీ. ఉద్యమం…

WhatsApp Image 2023-12-07 at 3.39.11 PM

మించౌంగ్ కారణంగా పంట నష్టపోయిన రైతులను మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కలిసి అన్యాయం చేస్తున్నారని బీ.జే.పీ. జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. కాకినాడలో నిర్వహించిన క్రైస్తవ సభలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి మరోసారి క్రైస్తవుడు సీఎం అవ్వడానికి మీరంతా సహకరించాలని అనడం ఆయనకు తగదంటూ సూచించారు. అలాగే దేశంలో ఉన్న రైతు సమస్యలపై తమ పార్టీ జాతీయ స్థాయి ఉద్యమం చేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ… రైతులు తుఫాను వల్ల దారుణంగా నష్టపోయారన్నారు.
సీ.ఎం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటన ద్వారా చెబుతున్నా… కిందిస్థాయి అధికారులు లేనిపోని వంకలు పెట్టి వారు నుంచి కొనుగోలు చేయడం లేదన్నారు. అందువల్ల వారు దళారులను ఆశ్రయించాల్సి వస్తుందని చెప్పారు. ఈ సమావేశంలోబీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, బీజేపీ నాయకులు తుమ్మల పద్మజ, యెనిమిరెడ్డి మాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ