మహారాజశ్రీ రైల్వే డిఆర్ఎం వారి దివ్య సముఖమునకు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ రాసుకున్న దరఖాస్తు విన్నపాన్ని అందించారు. సామర్లకోట రైల్వే స్టేషన్ కాకినాడ జిల్లాకు మెయిన్ స్టేషన్ అయి ఉన్నది ఆ రైల్వే స్టేషన్ నుండి కాకినాడ కు వెళ్లాలన్న స్టేషనుకు అనుకుని 12 మండలాల ప్రజలు ఇటు విశాఖపట్నంలోకి వెళ్లడానికి హైదరాబాద్ వెళ్ళటానికి గాని మెయిన్ స్టేషన్ అయి ఉందని ఆ లేఖలో తెలియజేశారు.
అలాంటి స్టేషన్లో సామాన్య ప్రజలు మరియు ఖరీదైన బండి ఎక్కి వారు అక్కడ నుండే ప్రయాణం చేస్తుంటారని, అలాంటి తరుణంలో సామర్లకోట స్టేషన్ నుండి విశాఖపట్నం వెళ్ళటానికి రాజమండ్రి, విశాఖపట్నం పాసింజర్ రైలు ఉండేది ఆ రైలును రద్దు చేయడం వలన సామాన్య ప్రజలు ప్రయాణం చేయుటకు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఖరీదైన బళ్ళు ఎక్కలేనీ సామాన్య ప్రజలు ఇలాంటి పాసింజర్ రైలు ఎక్కి ప్రయాణం చేయటానికి అనువైన ట్రైన్ కావడం వలన పాసింజర్ రైలు పున ప్రారంభించవలసిందిగా తమకు మానవ హక్కుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని, సింహాద్రి ఎక్స్ప్రెస్ సామాన్య ప్రజలు ప్రయాణించడానికి చాలా అనుకూలమైన ట్రైన్ అయినందువలన ప్రజలు ప్రయాణిస్తూ ఉండేవారనీ… కానీ ఈ మధ్యకాలంలో సింహాద్రి ఎక్స్ప్రెస్ రద్దు కావడం వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా ఖరీదైన ట్రైన్స్ ఎక్కటానికి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ లేఖలో ఆయన విన్నపాన్ని తెలిపారు.