లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించిన మోహన్లాల్ ప్రధాన పాత్రలో చేసిన ఫాంటసీ డ్రామా మలైకోట్టై వాలిబన్ సినిమా 25-జనవరి- 2024 న దియేటర్లలో ఘనంగా ప్రారంభమైంది. ఇది మొదటి రోజే భారీ అంచనాల మధ్య 5.65 కోట్ల రూపాయిలను రాబట్టింది. కానీ రెండవ రోజు దాదాపు సగానికి పడిపోయింది.
శుక్రవారం రిపబ్లిక్ డే సెలవు రోజున 2.75 కోట్లు మాత్రమే రాబట్టింది అంచనాలను తలక్రిందులు చేసింది. ఇది రెండు రోజుల మొత్తం 8.4 కోట్లు మత్రమే రాబట్టింది. మలైకోట్టై వాలిబన్లో సోనలీ కులకర్ణి, హరీష్ పెరడి, మనోజ్ మోసెస్, కథా నంది, డానిష్ సైత్ మరియు మణికందన్ ఆచారి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా హిందీ, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో కూడా డబ్ చేయబడింది.