2024 లోక్సభ ఎన్నికలు నియంతృత్వానికి, రాజ్యాంగానికి మధ్య జరిగే పోరు అని కాంగ్రెస్ పార్టీ శనివారం పిలుపునిచ్చింది. పార్టీ అధినేత పవన్ ఖేరా మాట్లాడుతూ… ఎన్నికల మోత మోగిందని అన్నారు. దీనికి ప్రజలకు పిలుపునిచ్చారన్నారు. ఈ న్యాయ యుద్దభూమిలో ప్రజాస్వామ్యం మమ్మల్ని హెచ్చరించిందని, మేము అన్నీటికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ రోజు ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలను ప్రకటించిందని ఆయన అన్నారు.
ఈ ఎన్నికలలో ఈ దేశాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని కూలీలు, రైతులు, మధ్యతరగతి ప్రజల భుజాలపై మోస్తారా లేక ఎంపిక చేసిన పెట్టుబడిదారుల భుజాలపై మోస్తారా అనేది నిర్ణయించబడుతుందని చెప్పారు. దేశం బాబా సాహెబ్ రాజ్యాంగం మార్గంలో నడుస్తుందా లేదా నియంత ప్రశంసల మీద నడుస్తుందా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనదని ఇది ఓటు మాత్రమే కాదు, దౌర్జన్యం మరియు దురహంకారాని అనిచే ఆయుదమని అన్నారు.