భూమి హక్కుల యజమాని చట్టం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ 27 /2023 అమలులోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రద్దు చేయాలి అని కోరుతూ ఆర్.సి.పి.ఐ. పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్.సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… ఈ చట్టం వల్ల సామాన్యులకు తమ భూమి ఆస్తులపై హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పలుకుబడితో భూ కబ్జాదారులకు వరంగా మారనుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దుర్మార్గపు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతుల్ని పట్టాదారు పాసు పుస్తకాల కోసం భూ రికార్డుల కోసం ఎమ్మార్వో పరిధిలో రెవెన్యూ శాఖ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి పి ఐ పార్టీ జిల్లా కార్యదర్శి డి నారాయణ మూర్తి, కేఎల్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ల్యాండ్ టైటిల్ యాక్టర్ రద్దుచేయాలి…
![WhatsApp Image 2024-01-25 at 9.59.32 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-25-at-9.59.32-PM.jpeg?resize=1080%2C679&ssl=1)