Viral

వారిని తక్షనమే తొలిగించండి…!!! -ఎలెక్షన్ కమీషన్-

rajeevkumardgppti-170369761938716_9

లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కుమార్ ను, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ చాహల్‌తో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బ్యూరోక్రాట్‌లు మరియు అధికారులను తొలగించాలని ఎన్నికల సంఘం సోమవారం ఆదేశారు జారీచేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లోని కొంతమంది కీలక అధికారులను తొలగించాలని భారత ఎన్నికల సంఘం ఈ.సీ.ఐ. ఆదేశించింది.

గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులు తమ పదవుల నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. అదనంగా మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లలో సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శులను కూడా భర్తీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ రాజీవ్‌ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రానున్న ఎన్నికలను నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకోబడ్డాయని తెలిపింది. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి, కొత్త ప్రభుత్వానికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.