ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ కనెక్షన్, సిలిండర్ల డెలివరీలో లబ్ధిదారుల నుంచి అదనపు సొమ్ము వసులు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టరేట్ జే.సీ. ఇలక్కియ పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ తో పాటు సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్ అందిస్తుందన్నారు.
కాకినాడ జిల్లాలో పీ.ఎం.యు.వై. కింద ఇప్పటివరకు సుమారుగా 32 వేల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంగించి లబ్ధిదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఏజెన్సీల లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.