విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆపాలని అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాకినాడలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా ఏ.ఐ.వై.ఎఫ్. రాష్ట్ర సహాయ కార్యదర్శి ,వై బాబి, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి , ఎం. గంగా సూరిబాబు ,పి.డి.ఎస్.యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, సిద్దు, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు బుల్లి రాజు, మాట్లాడుతూ… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని విశాఖపట్నంలో అక్కడి కార్మికులు దీక్షలు చేపట్టి 1000 రోజులు అయిన సందర్భంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బందుకు పిలుపునివ్వడం జరిగిందని దీనికి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు సంపూర్ణంగా బంద్ ఇచ్చారని అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా దీనికి మద్దతు తెలియజేశారని వారికి విద్యార్థి యువజన సంఘాలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ. కాకినాడ నగర కార్యదర్శి వాసుదేవ్, నగర నాయకులు జయరాం ఆదర్శ్ రోహిత్ రాజేష్ ,అభిషేక్ , సాహిత్ , ఏ.ఐ.వై.ఎఫ్. నాయకులు గోనెల నాగభూషణం, నాని సూరంపూడి, సి.హెచ్. అశోక్ , ఎమ్. వీరబాబు , విద్యార్థి జేఏసీ నాయకులు మురళి సాయి,లు పాల్గొన్నారు
విద్యాసంస్థల బంద్ విజయవంతం… సంపూర్ణంగా బంద్ ప్రకటించిన విద్య సంస్థలు…
![IMG-20231108-WA0016](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231108-WA0016.jpg?resize=1280%2C700&ssl=1)