శుభానికేతన్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి…
రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూల్ కు ఈ నెల 11నుండి 21 వరుకు సంక్రాంతి సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా సరే కాకినాడ రూరల్ మండలం సర్పవరం లో గల శుభానికేతన్ స్కూల్ పండుగ ముందు రోజు 13వ తేదీ వరుకు స్కూల్ నడపింది. పండుగ తరువాత నేడు కూడా ప్రభుత్వం సెలవులు పెంచిన సరే ప్రభుత్వ నిబంధనల పాటించని శుభానికేతన్ స్కూల్ పై గతంలో కూడా విద్యా శాఖ అధికారులకు పిర్యాదు చేసిన స్పందించడం లేదు అని తక్షణమే ఈ విద్యాసంస్థ పై చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ మండలం విద్యా శాఖ అధికారి గణేష్ బాబు గారి కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ. మండలం కార్యదర్శి సి.హెచ్. సాహిత్, ప్రభు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.