పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. శనివారం కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పి.టి.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ… దేశంలో అన్ని రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు.
విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యా రంగాన్ని బలోపేతం చేసి విద్యను పేదలకు దగ్గర చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.టి.ఎస్.ఎఫ్. ప్రధాన కార్యదర్శి ములుగు కిరణ్ కుమార్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ పరమట భారతి, ట్రెజరర్ ఎస్కె కరీమున్నీసా, తదదితరులు పాల్గొన్నారు.