విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. రెండు రోజుల వ్యవధిలోనే మూడవ కీలక నేత కూటమికి గుడ్బై చెప్పారు. బీహార్ రాష్ట్ర సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్సభ ఎన్నికల ముందు యూ- టర్న్ తీసుకొని బీజేపీతో చేరనున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్ కు ప్రదానం చేయాలని నిర్ణయించడంతో నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపడంతో ఈ వార్త రాజకీయాల్లో హాట్ టాపిక్క గా మారింది.
గత రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు తృణ మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఇండియా కూటమికి గుడ్బై చెప్పాయి. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా దూరమైతే కూటమికి భారీ ఎదురుదెబ్బని చెప్పక తప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.