![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/hanging.jpeg?resize=184%2C274&ssl=1)
కాకినాడ మాధవ్ నగర్ వీధిలో పనిచేస్తున్నసామర్లకోటకు చెందిన వరలక్ష్మి (36) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఒక ఇంట్లో పనిచేస్తున్న ఆమె అదే ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటన శనివారం జరుగగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోనికొచ్చింది. మృతురాలి బంధువులు యజమాని ఇంటి వద్ద ఆందోళనకు పూనుకున్నారు. ఇంటి యజమాని కొట్టి చంపినట్లు బంధువులు ఆరోపణల నేపద్యంలో సంఘటన స్థలానికి చేరుకొని సర్పవరం పోలీసులు కేసు సంఘటనపై ఆరా తీస్తున్నారు.