సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా సి.హెచ్. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం పార్టీ ముఖ్యులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో విశాఖ దక్షిణ స్థానం అభ్యర్థిగా వంశీకృష్ణ పేరును ఖరారు చేశారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
విశాఖపట్నం దక్షిణ స్థానం అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్…
![OIF (2)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/OIF-2-1.jpg?resize=474%2C266&ssl=1)