Andhra Pradesh

విష సర్పాల నుంచి రక్షణకు ప్రత్యేక చర్యలు…. జడ్పీ బాలికలను పరిశీలించిన ఎంఈఓ

WhatsApp Image 2023-10-16 at 2.41.33 PM

సామర్లకోట పట్నంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల తరగతి గదిలో పాములు హల్చల్ పై వివిధ పత్రికలో వచ్చిన కథనాలపై సామర్లకోట మండల విద్యాశాఖ అధికారి వై శివరామకృష్ణయ్య స్పందించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ బాలికల హై స్కూలును పరిశీలించారు. ఊసలు తీస్తుండగా వాటి మధ్య నుంచి పాములు బయటకు వచ్చి తరగతి గదిలో దూరడంతో వివిధ పత్రికల్లో వార్తా కథనాలు వెలుపడ్డాయి. ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల పరిశీలించి పాముల హల్ చల్ పై హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని మీనా మాధురిని ప్రశ్నించారు.
దీనిపై సత్వర చర్యలో భాగంగా వైస్ చైర్మన్ జాన్ మోజెస్ సహకారంతో జెసిబి ని ఏర్పాటు చేసి హై స్కూల్ లో పేరుకుపోయిన తుప్పల తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జాన్ మోజెస్ మాట్లాడుతూ…. హైస్కూల్ ప్రహరీ గోడకు చుట్టుపక్కల ఉన్న తుప్పలను తొలగించడం వలన విష సర్పాలు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం హై స్కూల్ కు సెలవుల కారణంగా విద్యార్థినిలు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదాలు జరగలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయిని యు. మీనా మాధురి, మున్సిపల్ కౌన్సిలర్ పాలిక కుసుమ చంటిబాబు, విద్యా కమిటీ చైర్మన్ డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం