భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24లో పొందిపరచబడిన రీతిలో సమాజంలోని బలహీన వర్గాల దోపిడీని నిరోధించడానికి కొన్ని చట్టాలు అమల్లో ఉన్నట్లు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ టీ. నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బ్యాంకు కాలనీ కార్మిక శాఖ కార్యాలయం నుండి ఎర్ర వంతెన మీదుగా ముమ్మిడివరం గేటు వరకు సహాయ కార్మిక కమిషనర్ ఆధ్వర్యంలో వెట్టి చాకిరీ నిర్మూలన దినంగా పాటిస్తూ అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ… నిర్బంధిత కార్మికులు, బాల కార్మికుల మానవ అక్రమ రవాణా వంటి కొన్ని నిబంధనలు చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలన్నారు. బాండెడ్ లేబర్లతో సహా అన్ని రకాల హ్యూమన్ ట్రాఫికింగ్ నేరాలను నిర్మూలించి, అన్ని రకాల మానవ అక్రమ రవాణా వెట్టిచాకిరీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని దృక్పథంతో ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. 1976 ఫిబ్రవరి 9న వెట్టి చాకిరి నిర్మూలన దినంగా పాటిస్తోందన్నారు.
ఆమేరకు సహాయ కార్మిక కమీషనరు డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ ఆఫీసర్ కోనసీమ జిల్లా వారి అధర్యంలో వెట్టి చాకిరీ నిర్మూలన దినంగా పాటిస్తూ ర్యాలిని నిర్వహించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జి. లక్ష్మి స్నేహ, సహాయ కార్మిక అధికారిణి, డి. రమేష్ బాబు, చైల్డ్ టెక్షన్ యూనిట్ నుండి M. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.