![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/IMG-20231029-WA0032.jpg?resize=640%2C289&ssl=1)
వైఎస్ఆర్సీపీ పాలనకు చమరగీతమే తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణే ప్రధాన ఎజెండా అని ఆ పార్టీల సమన్వయ కర్త మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కాకినాడ సాంబమూర్తినగర్లోని విఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇరుపార్టీల జిల్లా నాయకులు హాజరయ్యారు. సమావేశానంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ అనేక కుట్రలు చేస్తోందని, సమన్వయాన్ని విడగొట్టాలని కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చమరగీతం పాడాలనే సంకల్పంతో ముందుకు సాగేందుకు సమావేశం తీర్మాణించిందన్నారు. రాష్ట్రంలో అనేక మంది రైతులు అప్పులపాలైపోయారన్నారు. కావలిలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై అతి దారుణంగా కొట్టిన వైనం, విఆర్ఓపై దాడికి పాల్పడ్డ తీరు రాష్ట్ర ప్రభుత్వ దాష్టీకానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు.