గొల్లప్రోలు మండలం చందుర్తి, కరప మండలం కోరాడ గ్రామంలో ఉన్న సుమారు 12 ఎకరాలకు సంబంధించి భూమిని డాక్టర్ నున్న కిరణ్ అమ్మకానికి పెట్టగా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన పెద్దబాబు మధ్యవర్తిగా లావాదేవీలు సాగిస్తున్న తరుణంలో పెదబాబుని నమ్మి భూమికి సంబంధించిన దస్తావేజులు అప్పగించినట్లు మృతుని తల్లి తెలిపారు.
తీరా దస్తావేజులు అప్పగించిన తరువాత డబ్బులు చెల్లించకుండా ఎదురు తిరగడంతో తమ కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడి తనను దిక్కులేని దానిని చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే తమకు చెందిన భూ విక్రయాల్లో రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ప్రధాన అనుచరుడు, ఆయన వ్యక్తిగత సలహాదారుడు గాలిదేవర బాలాజీ కూడా కూరాడ భూమి విక్రయంకు సంబంధించి డబ్బులు ఇవ్వకుండా తమ బిడ్డను ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని తెలిపారు.
మొత్తం మీద కాకినాడ రూరల్ పరిధిలో జరుగుతున్న భూకబ్జాల పరంపరలో కన్నబాబు అనుహాయలు అకృత్యాలు వెలుగు చూస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై కాకినాడ 2 టౌన్ సిఐ నాగేశ్వర్ నాయక్ మాట్లాడుతూ డాక్టర్ కిరణ్ ఆర్థిక సమస్యలతో మరణించినట్టు ఆయన తల్లి తెలియజేసిందన్నారు.