మహిళలకు అసలైన ఆర్థిక స్వావలంబన కలుగుజేసిన ఏకైక ప్రభుత్వం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ ఆర్ ఆసరా నాలుగవ విడత పంపిణీ కార్యక్రమినికి స్దానిక సాంబమూర్తి నగర్ 5వ వీధిలో, గుడారి గుంట భగీరథ గుడి ప్రాంతంలో ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు చిడ్నీడి నారాయణ మూర్తి, కంపర బాబీ, పలకా సూర్యకుమారి, అధ్యక్షతన ఏర్పాటు చేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అసలైన ఆర్థిక స్వాహంబన కలిగించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయల సంక్షేమాన్ని మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళల డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు మోసం చేశాడని నమ్మి ఓట్లు వేసినా మహిళలను నిలువునా ముంచేసిన చంద్రబాబు నాయుడు కుట్రకు బలయ్యారన్నారు.