రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతాంగానికి పూర్తిస్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని టీడీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్ర రావు ఆరోపించారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో చిక్కాల విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వం నీటిపారుదల రంగానికి సరైన నిధులు, విధులు నిర్వహించుకోవడం వల్ల చివరి ప్రాంతాలకు నీరంధక, మరికొన్ని చోట్ల వరినాట్లు వేయడం మానేశారన్నారు.
ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు గాను నాలుగు లక్షలు మాత్రమే పంటలు వేశారని మరో రెండు లక్షల ఎకరాలకు పంటలు వేయలేదన్నారు. తక్షణమే రైతులకు పంటల భీమా, నష్టపరిహారం చెల్లించాలని రామచంద్ర రావు డిమాండ్ చేశారు. ఆర్బికె కేంద్రాల వద్ద బస్తాకు 200 రూపాయలు చొప్పున రైతులను మోసం చేస్తున్నారంటూ చిక్కాల ఆవేదన వ్యక్తం చేశారు.