వై.యస్. రాజశేఖర్ రెడ్డి వారసుడు తన సోదరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కాదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సోమవారం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి కుమార్తె, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మాట్లాడుతూ… తన తండ్రి పాలనకు, తన సోదరుడి పాలనకు అసలు పొంతన లేదని అన్నారు. జగన్ అస్సలు వైఎస్ఆర్ వారసుడు కాదు. వైఎస్ఆర్, జగన్ల పాలనలో సారూప్యత లేదు… భూతద్దం పెట్టి వెతికినా జాడ కనిపించడం లేదు. జగన్ హయాంలో హత్యా రాజకీయాలున్నాయని కడప జిల్లా మైదుకూరులో షర్మిల తన ప్రచారంలో ఆరోపించారు.
జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ మామ వై.ఎస్. వివేకానందరెడ్డిని చంపిన హంతకులకు రక్షణ కల్పిస్తోందని, వై.ఎస్. అవినాష్రెడ్డికి రక్షణ కల్పిస్తోందని ఆమె ఆరోపించారు. కడప మాజీ ఎం.పీ., రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న ఎన్నికల సమయంలో హత్యకు గురైనప్పటికీ కేసు అపరిష్కృతంగా కొనసాగుతోందని ఆమె అన్నారు. ఈ కేసులో నిందితుడు, కడప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డిని పార్లమెంట్కు వెళ్లనివ్వకూడదని పేర్కొన్న షర్మిల, అన్యాయంపై పోరాడేందుకే తాను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు.