వైసిపి పాలన నుంచి కాకినాడ నగరాన్ని కాపాడుకోవలిసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం, జనసేన, బీ.జే.పీ., కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ 9 వ డివిజన్లో దుర్గమ్మ గుడిలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు, బీ.జే.పీ. నాయకులు పైడా భవాన ప్రసాద్, జనసేన నాయకులు సత్యనారాయణ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం డివిజన్లో పర్యటించి తెలుగుదేశం కూటమి అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి కర పత్రాలను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంగా విధ్వంసకర, అరాచక, అవినీతి మరియు దోపిడీ పాలన కొనసాగుతుందని అన్నారు. వై.సి.పి. ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలను, ఇంటి పన్నులను, బస్ చార్జీలను విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచి, చెత్త పన్ను లను వేసి ప్రజల కష్టార్జితాన్ని జలగల్లా పట్టుకొని పీడించి దోచుకున్నారని అన్నారు. వైసిపి అరాచక పాలన నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని కాకినాడ నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నేడు రాష్ట్ర ప్రజలపై కాకినాడ ప్రజలపై ఉన్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి. నాయకులు పైడా వెంకటనారాయణ, పైడా భవన్ ప్రసాద్, మల్లిపూడు వీరు, డివిజన్ తెదేపా అధ్యక్షులు వాసంశెట్టి చిట్టప్ప, లూటుకుర్తి మోహన్, తదితరులు పాల్గొన్నారు.