కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజక వర్గం యానాదుల కాలనీలో 150 మంది వై.సీ.పీ. పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఆది వారం రాత్రి జరిగిన సమావేశంలో వర్మ వారందరికి షాలువాలు కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఎంతో అమాయకులు బలయ్యారని, రాష్ట్ర ప్రజలంతా ఆయన పాలనకు విసిగాపోయారని అన్నారు. ఇప్పడు ప్రజలంతా ఓటు అనే ఆయుధంతో జగన్ ని తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయన్నారు. జగన్ దీనికి సద్దంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.