ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో వై.సీ.పీ. పార్టీ ఎం.పీ. టిక్కెట్ ఇచ్చినా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలోకి చేరిపోయారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు లో జరిగిన కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన వందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా టీ.డీ.పీ. లో చేరారు. పీ.వీ.ఆర్. కన్వెన్షన్లో నిర్వహించిన చేరికల సభలో కార్యకర్తలు, నాయకులు, పెద్ద ఎత్తున తరలి వచ్చారు.