రాజకీయాల్లో డబ్బు, అధికార అహంకారం తగ్గి డా. బీ.ఆర్. అంబేద్కర్ అధ్యర్యంలో రాసిన భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ సమానంగా అందినప్పుడే నిజమైన గణతంత్ర సంబరం అని జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మధ్య ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మనోహర్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం జాతి నాయకులు చేసిన త్యాగాలు చాలా గొప్పవని అన్నారు.
వ్యక్తిగత స్వార్థం వీడి రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి…
![Nadendla-Manohar-to-join-Jana-sena](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/Nadendla-Manohar-to-join-Jana-sena.jpg?resize=600%2C400&ssl=1)