కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 గదుల పాత భవనమును విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి పరిశీలించారు. విద్యాశాఖకు చెందిన ఎన్.ఎస్.డీ. సత్తిరాజు, కాకినాడ డి.ఇ. బి.వి.వి. సత్యనారాయణ, ఎస్ఇ పి.ఆర్. డి.ఇ. వి. భాస్కర రావులతో కలసి ఆమే పాఠశాల భవనమును పరిశీలించి, ఇంజనీరింగ్ సిబ్బందికి పలు ఆదేశాలు చేశారు. బిల్డింగ్ ప్లాన్ పరిశీలించి క్వాలిటీ సేంపిల్స్ ను వెంటనే తీసి పరీక్షలకు పంపించి వాటి రిపోర్టులను అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న తరగతి గదుల పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు, ప్రధాన ఉపాధ్యాయునికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్జెడి వెంట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, ఎంఈవో శివరామకృష్ణయ్య, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు పి అనూరాధ, పాఠశాల సిబ్బంది, గ్రామ నాయకులు
పాల్గొన్నారు.