దళితుల ఆత్మగౌరవం నిలిపిన తీర్పు. 28 సంవత్సరాల తర్వాత అనేక పోరాటాల ఫలితంగా వెంకటాయపాలెం శిరోమండన బాధితులకు న్యాయం జరిగింది. 1996 డిసెంబర్ 26న దళిత యువకులకు శిరోమండనం చేయించిన ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్ట్ 18 నెలల జైలు, రెండు లక్షలు యాబై వేలు జరిమానా విధించడం పట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఎస్. వినోద్, పచ్చిపాల సంపత్ కుమార్ హర్ష వ్యక్తం చేశారు.
ఈ రోజు విశాఖపట్నం కోర్టు వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ… సుదీర్ఘ పారాటం తర్వాత దళితులకు న్యాయం జరిగిందని వారు వర్షం వ్యక్తం చేశారు. వై.సి.పి. పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని దళితులకు శిరోమండనం, గాయపర్చిన తోట త్రిమూర్తులను, దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ను కాపాడేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు.