శివనామస్మరణతో కోనసీమ దేవాలయాలు మారుమోగాయి. డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దాదాపు 200 సంవత్సరాలు నాటి పురాతన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. క్యూ లైన్ లో స్వామి వారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూచి మంచి చారిటబుల్ ట్రస్ట్ కూచిమంచి మల్లప్ప రాజు, కూచిమంచి శశి, ట్రస్ట్ సభ్యులు భక్తులకు కావలసిన సౌకర్యాలు అందించడం జరిగింది.