కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శ్రీనగర్ లో రెండు రోజులపాటు జరగనున్న స్మార్ట్ సిటీల వర్క్ షాప్ లో పాల్గొనేందుకు కాకినాడ స్మార్ట్ సిటీ సీ.ఈ.ఓ., మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్. నాగ నరసింహారావు వెళ్లారు. బహిరంగ ప్రదేశాలను ప్రజలకు ప్రయోజనకరంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం, సైకిల్ 4 చాలెంజ్, ఈట్ స్ట్రీట్ ల అభివృద్ధి వంటి అంశాలపై ఈ సదస్సు జరుగుతుందని తెలియచేశారు. దేశం లోని వివిధ స్మార్ట్ సిటీ ల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. ఆయా స్మార్ట్ సిటీలలో ఇప్పటికే అమలు జరుగుతున్న ఆయా అభివృద్ధి పనులను వర్క్ షాప్ వేదికగా చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ పై సదస్సుకు హాజరయ్యే ఉన్నతాధికారులు దిశా నిర్దేశం చేయనున్నారు నాగ నరసింహారావు వెల్లడించారు.
శ్రీనగర్ సదస్సుకు కమిషనర్ నాగ నరసింహారావు…
![1000041012](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/1000041012.jpg?resize=1280%2C700&ssl=1)