కాకినాడ జాల్లా పెద్దాపురం రామారావు పేటలో ఉన్న శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎన్.సి.సి. విద్యార్ధులకు “ఎ” సర్టిఫికెట్ సంభందిత అర్హత పరీక్షను సుబేదార్ మేజర్ హేమంత్ కుమార్, హవల్దర్ లు రఫిజైన్ మరియు కేమ్ రాజ్ తాపా ఆధ్వర్యంలో కాకినాడ పద్దెనిమిదవ బెటాలియన్ కల్నల్ వివేక్ సావన్ గురుదర్ నిర్వహించారు. ఈ పరీక్షకు పెద్దాపురం, హంసవరం, ప్రత్తిపాడు వంటి ఐదు పాఠశాలల నుండి సుమారు 150 విద్యార్థులు పాల్గొన్నారు.
కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ సవ్యసాచి దాస్ ఈ పరీక్ష రాస్తున్న విద్యార్ధులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఈ ఎన్.సి.సి. ట్రైనింగ్ భవిష్యత్తులో క్రమశిక్షణ అలవరుస్తుందని, డిఫెన్స్ వంటి వాటిల్లో చేరడానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకడమిక్, కల్చరల్ కో-ఆర్డినేటర్లు, వివిధ పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.