Exclusive

శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ లో విజిలెన్స్ తనిఖీలు…

WhatsApp Image 2024-03-06 at 4.01.23 PM

పీ.డీ.ఎస్. బియ్యం దారి మళ్లింపుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలంలోని తాపేశ్వరం గ్రామమునందలి శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ ను విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లయ్స్ అధికారులతో తనిఖీ చేసారు. సదరు మిల్లు నందు మండపేట మండలములోని వెలగతోడు గ్రామానికి చెందిన ఏరుబండి సురేష్, తండ్రి పుల్లయ్య బి 120 కేజీల బియ్యాన్ని రైస్ మిల్లులో విక్రయించడానికి తీసుకొనివచ్చి అన్‌లోడ్ చేస్తున్నప్పుడు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

వారిద్దరిని విచారించగా వారు కార్డుదారుల నుండి బియ్యాన్ని కిలోకు రూ. 16 కి కొనుగోలు చేసి దానిని కిలోకి రూ. 20 రైస్ మిల్లర్‌కు విక్రయించినట్లు పేర్కొన్నాడు. మిల్లు యజమాని మరియు సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు కొరకు పోలీసు స్టేషన్ కు సిఫారసు చేయటమైనది. ఈ సందర్భముగా రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి. సుబ్బారెడ్డి, ఐ.పి.ఎస్ మాట్లాడుతూ… రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో చౌక బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవ్వరైనా చౌక బియ్యం కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పైన మరియు మిల్లుల యాజమాన్యాల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.