షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) ఉప వర్గీకరణను అనుమతించకపోవడం వల్ల వారిలో అభివృద్ధి చెందినవారు కూడా అన్ని ప్రయోజనాలను పొందే పరిస్థితికి దారి తీస్తుంది. ఎస్సీల ఉప-వర్గీకరణ ప్రశ్నను లేవనెత్తే సూచనపై తీర్పును రిజర్వ్ చేయడంతో సుప్రీంకోర్టులోని 7 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం దానిని పరిశిలించింది.
ఈ కేసులో ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది మనోజ్ స్వరూప్ వాదనలు వినిపిస్తూ… ఈ.వీ. చిన్నయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై 2004లో ఇచ్చిన తీర్పులో ఎస్సీ పేర్కొన్న ప్రకారం షెడ్యూల్డ్ కులాలు సజాతీయ గ్రూపుగా ఏర్పడ్డాయని అందువల్ల వాటి మధ్య ఎలాంటి ఉపవిభజన ఉండదని అన్నారు.
ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి జారీ చేసిన షెడ్యూల్డ్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని వాదించారు. ఏదైనా మార్పు అవసరమైతే పార్లమెంటు మాత్రమే చేయగలదని ఆయన వాదించారు.