ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్దాయి జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అందిన ధరఖాస్తులు ప్రజలకు సంతృప్తి కలిగే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్డిఏ పి.డి. డా. ఆర్. విజయరాజు, ఆర్డివో ఎన్ఎస్ కె. ఖాజావరి, వ్యవసాయశాఖ జె.డి. రామకృష్ణ లతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ స్పందన కార్యక్రమానికి 210 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజల నుండి అందే విజ్ఞప్తులను క్షేత్రస్ధాయిలో పరిశీలించిన తర్వాత పరష్కార విధానంపై ప్రజలు సంతృప్తి చెందని కారణంగా ధరఖాస్తులు రీ-ఓపెన్ అవతున్నాయన్నారు. స్పందన ధరఖాస్తులు రీ-ఓపెన్ కాని రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ధరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు, సిబ్బంది అర్జీదారులకు నాణ్యతగల పరిష్కార ఎండార్స్మెంట్ అందజేయాలని కలెక్టర్ తెలిపారు.