Culture

సంస్కృతీ సంప్రదాయం వారసత్వ సంపదకు గోపురం…

WhatsApp Image 2024-02-01 at 12.35.22 PM

కరువు మరియు వరదల నివారణ ప్రపంచ ప్రజా కమీషన్ ఆధ్వర్యాన డాక్టర్ రాజేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా బోలిశెట్టి సత్యనారాయణ శివశంకర్ నిర్వహణలో ప్రెసింగి ఆదినారాయణ నిర్వహించిన కాకినాడ వారసత్వ సంపద సంరక్షణపై జరిగిన చర్చా కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ… ఆలయ గోపురంగా సంస్కృతీ సంప్రదాయ వైభవమైన ప్రాచీన సంపదను పర్యావరణా న్ని కాపాడుకుంటేనే లోకకళ్యాణం కొనసాగు తుందని పేర్కొన్నారు. కోరంగి అభయారణ్యం చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం, బిక్కవోలు ఆలయాలు, ఓడరేవు, కలెక్టర్ బంగ్లా, తహశీల్దార్ కార్యాలయం, రంగూన్ మేడ. హోప్ ఐలాండ్, బ్రహ్మోపాసన మందిరం, విక్టోరియా వాటర్, తదితర ప్రాచీన అంశాలను తన ప్రసంగంలో ఉదహరిం చారు. ప్రజలను చైతన్యం చేసే దిశగా ముందడుగు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది