విశాఖ పట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొత్తగా నిర్మంచిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, వై.సీ.పీ. కార్యకర్తలు, వాలంటీర్లు, సర్పంచ్ అందరూ కలిసి సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు అంటూ ప్రతి పక్ష నాయకులు, జనాలు మండిపడుతున్నారు. ఇటువంటి బాధ్యత రహితమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు పై అధికారులకు డిమాండ్ చేసారు.