అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారని తెలిపారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ ఆ ప్రాంత విశిష్టతలను తెలుసుకున్నారు.
శ్రీరామ నామ జపంతో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ మందిరం దగ్గర సెల్ఫీ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “అయోధ్య ఆలయ నిర్మాణం కోసం భరత జాతి కొన్ని శతాబ్దాలగా వేచి చూసిందన్నారు. నేటి కార్యక్రమ సమయం ఓ ఉద్వేగ క్షణమన్నారు. నిజంగా ఇది భారతీయులందరికీ భావోద్వేగ సమయంగా పరిగనించాలన్నారు.