శ్రీవారి సంకీర్తనల గానామృతంతో సన్మంగళకర శుభాలు కలుగుతాయని భోగిగణపతి పీఠంపేర్కొంది. అన్నమయ్య కీర్తనలు స్తోత్రాలు శ్రీవారి భక్తులకు వరప్రదాయకంగా నిలిచాయని 20వ జపయజ్ఞ పారాయణ జరిగిన సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. తిరుమల పాదయాత్రతో ప్రతిష్ట జరిగిన శ్రీవారి పాదాల వద్ద సుప్రభాత వేళలో 7 శనివారాలు గోగృత జ్యోతులు వెలిగించి సామూహిక పారాయణను సత్సంకల్పం చేపట్టిన శ్రీవారి సేవకులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి శనివారం తెల్లవారుజామున జరుగుతున్న అష్టోత్తర పుష్పార్చనతో ధూప దీప నైవేద్య మంగళ హారతి శ్రవణానందకరంగా భక్తు లను పరిసరాలను విశేషంగా అలరిస్తోంది.
సన్మంగళకరంగా శ్రీవారి సంకీర్తనలు…
![WhatsApp Image 2024-03-16 at 12.13.12 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-16-at-12.13.12-PM.jpeg?resize=1280%2C700&ssl=1)