Trending News

సమ్మె చేసే పరిస్థితి రాకుండా సమస్యలు పరిష్కరించండి…

WhatsApp Image 2024-02-02 at 5.41.22 PM

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 3 వ కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… పేదలకు సేవలు అందించడం లో జి.జి.హెచ్. కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాము సమ్మె చేస్తే ప్రజలకు, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు‌. అందువల్ల చాలా ఓపికగా తమ సమస్యలను అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థ వారికి విన్నవిస్తూ వచ్చామన్నారు. సమ్మె చేసే పరిస్థితి రాకుండా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.
యూనియన్ సభ్యురాలు జి. మంగ మాట్లాడుతూ… నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. తమకు వచ్చే జీతం కుటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. జీతాలు పెంచాలని, తమ జీతం నుండి అదనంగా కత్తిరిస్తున్న పి.ఎఫ్. సొమ్ము తిరిగి చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ లతో పాటు యూనియన్ నాయకులు ఎస్. వాసు, పుష్ప, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్