కాకినాడ రామారావుపేటలోని మహర్షి బులుసు సాంబమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఓరియంటల్ ఉన్నతపాఠశాలలో బాలల దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ (హెన్) ప్రాజెక్ట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.ఎన్. మూర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… పాఠశాలలో ప్రతి గురువారం తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ విధానం వలన విద్యార్థులలో ఆరోగ్యం పై అవగాహన ఏర్పడుతుందన్నారు.
వ్యక్తిత్వ వికాస నిపుణులు వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ… విద్యార్థులలో నిద్రాణంలో ఉన్న శక్తి యుక్తులను వెలికితీసే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. లక్ష్య సాధనకు చదువు ఒక్కటే ఏకైక ఆయుధమన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులను అందచేసారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఛైర్ పర్సన్ సత్య మలిరెడ్డి, ఉపాధ్యాయులు జీ.వీ.పీ. రామలక్ష్మి, ఎ.జీ.వీ.సుబ్బారావు, టీ. రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.