రాష్ట్రంలో ఎన్నికల దృష్య కాకినాడ జిల్లాలో అన్ని ప్రాతాలలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న సెంటర్లు, పోలింగ్ బూత్ లో పరిధిలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. వారు ఏరియాల వారిగా అవగాహన పెంచుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో వారు యొక్క ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనేదానిపై కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ డి.ఎస్.పి లతా కుమారి, సామర్లకోట ట్రైనింగ్ డిఎస్పి, సీఐ సురేష్, ఎస్సై మూర్తి,లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.